నాగశౌర్యకు మరో సినిమా

నర్తనశాల తరవాత ఓ బెబీ తప్ప మరో సినిమా విడుదల కాలేదు. ఆ సినిమా కూడా సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే హీరో నాగశౌర్య లైనప్ మాత్రం ఫుల్ బిజీగా వుంది. చేతినిండా సినిమాలతో…

నర్తనశాల తరవాత ఓ బెబీ తప్ప మరో సినిమా విడుదల కాలేదు. ఆ సినిమా కూడా సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే హీరో నాగశౌర్య లైనప్ మాత్రం ఫుల్ బిజీగా వుంది. చేతినిండా సినిమాలతో వున్నాడు ఇప్పుడు. తన స్వంత బ్యానర్ లో అశ్వధ్దామ సినిమా ఫినిష్ చేస్తూనే, అవసరాల శ్రీనివాస్-పీపుల్స్ మీడియాతో ఓ సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమా అలా వుండగానే సుబ్రహ్మణ్యపురం డైరక్టర్ సంతోష్ తో పార్థు అనే సినిమాను ఆసియన్ సునీల్ నిర్మాతగా ఓకె చేసాడు. విలువిద్య నేపథ్యంలో సినిమా ఇది. వీటన్నింటికి తోడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సౌజన్య అనే మహిళా డైరక్టర్ తో మరో సినిమా లేటెస్ట్ గా ఓకె చేసాడన్నది తాజా వార్త.

మొత్తంమీద ఈ రేంజ్ హీరోలు ఎవ్వరికీ ఒకేసారి నాలుగైదు సినిమాలు చేతిలోలేవు. కానీ నాగశౌర్య మాత్రం ఇన్ని సినిమాలు చేతిలో పెట్టుకున్నాడు. ఈ లెక్కన 2020లో రెండు నెలలకో సినిమా వదుల్తాడేమో?

ఈమె హీరోయిన్.. ఇతను హీరో కమ్ విలన్..