Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ చైతన్యకి మళ్లీ అవే కష్టాలు

నాగ చైతన్యకి మళ్లీ అవే కష్టాలు

నాగచైతన్య నటిస్తోన్న 'సవ్యసాచి' చిత్రానికి అనౌన్స్‌ చేసినపుడే మంచి క్రేజ్‌ వచ్చింది. 'ప్రేమమ్‌' తర్వాత చై, చందు మొండేటి కలిసి చేస్తోన్న చిత్రమిది. మాధవన్‌ కీలక పాత్ర చేస్తోన్న ఈ చిత్రంపై నాగార్జునకి కూడా చాలా నమ్మకముంది. అయితే ఈ చిత్రం సకాలంలో పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం రిలీజ్‌ ఎప్పుడనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

నాగ చైతన్య సినిమాలు నిర్మాణ దశలో ఆసక్తి కలిగించడం, తర్వాత ఆలస్యమయి కళ తప్పడం ఇదేమీ కొత్త కాదు. గతంలోను 'ఆటోనగర్‌ సూర్య', 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలకి ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ చిత్రాలు ఆలస్యమవడం వల్ల అభిమానులే ఆసక్తి కోల్పోయారు. 'సవ్యసాచి'కి కూడా అలాంటి స్థితి వస్తుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

నాగ చైతన్యకి అసలే యాక్షన్‌ జోనర్‌ కలిసి రాలేదు. అతను చేసిన యాక్షన్‌ సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిలయ్యాయి. అయితే చందు మొండేటికి మంచి గుడ్‌విల్‌ వుండడంతో సవ్యసాచి చైతన్యకి కొత్త ఇమేజ్‌ తెస్తుందనే నమ్మకముంది. కానీ ఈ చిత్రం ఇలా డిలే అవుతూ నెమ్మదిగా క్రేజ్‌ కోల్పోతూ వుండడమే ఫాన్స్‌ని బాధిస్తోంది. నాగచైతన్య కూడా ఒకే సినిమాపై పూర్తి దృష్టి పెట్టకుండా పలు చిత్రాలు ఒకేసారి మొదలు పెట్టి క్రేజ్‌ డైవర్ట్‌ అయిపోవడానికి కారకుడవుతున్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?