ఆ ఇద్దరు మళ్లీ కలుస్తున్నారు.. ఈసారి ఏంటో?

కృష్ణార్జున యుద్ధం ఫెయిల్యూర్ తర్వాత నాని పూర్తిగా మారిపోయాడు. మాస్ సినిమాలు పక్కనపెట్టి కొత్త కథలు, సరికొత్త క్యారెక్టర్లను ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే జెర్సీ లాంటి వినూత్నమైన కథాంశాన్ని సెలక్ట్ చేసుకున్న నాని,…

కృష్ణార్జున యుద్ధం ఫెయిల్యూర్ తర్వాత నాని పూర్తిగా మారిపోయాడు. మాస్ సినిమాలు పక్కనపెట్టి కొత్త కథలు, సరికొత్త క్యారెక్టర్లను ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే జెర్సీ లాంటి వినూత్నమైన కథాంశాన్ని సెలక్ట్ చేసుకున్న నాని, ఇప్పుడు మరో దర్శకుడితో చేతులు కలపబోతున్నాడు. 

అవును.. నాని-గౌతమ్ మీనన్ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో 'ఎటో వెళ్లిపోయింది మనసు' అనే సినిమా వచ్చింది. అందులో నాని క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. కానీ సినిమా ఫెయిల్ అయింది. ఆ మూవీ ఫ్లాప్ అయినా మరోసారి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడట నాని. 

మారిన మైండ్ సెట్ కారణంగా ఇప్పటికే తన లిస్ట్ లో ఉన్న కొన్ని ప్రాజెక్టుల్ని నాని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఫ్రెండ్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాతో పాటు హను రాఘవపూడి సినిమాను కూడా నాని హోల్డ్ లో పెట్టాడు. మరోవైపు సొంత బ్యానర్ పై నిర్మించనున్న సినిమాల్ని కూడా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. 

విక్రమ్ తో సినిమాను దాదాపు పూర్తిచేసిన గౌతమ్ మీనన్, ప్రస్తుతం ధనుష్-మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత నాని సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.