Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నరేష్ ను దెబ్బతీసిన మహేష్ సినిమా

నరేష్ ను దెబ్బతీసిన మహేష్ సినిమా

మహర్షి సినిమాతో కొత్త లైఫ్ వస్తుంది అనుకున్నాడు అల్లరి నరేష్.  హీరోగా కాకుండా మంచి క్యారెక్టర్లు చేసినపుడల్లా నరేష్ కు బాగానే పేరు వచ్చింది. అలాగే మహర్షిలో కూడా మంచి పేరే వచ్చింది. కానీ సినిమాలు మాత్రం రాలేదు. ఇలాంటి టైమ్ లో చాలా సైలంట్ గా ఓ సినిమా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రెడీ అయిపోయింది. కొద్దిగా ప్యాచ్ వర్క్ మిగిలింది.

అదిగో అక్కడ తేడా వచ్చేసింది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో ఫుల్ బిజీ అయిపోయారు. మహేష్ సినిమా, దాదాపు 150 కోట్ల సినిమా, సంక్రాంతికి ఏ సమస్యా లేకుండా రెడీ అవ్వాల్సిన సినిమా. దాంతో ఆయన తన ఫుల్ అటెంక్షన్ అటే పెట్టారు. 

దీంతో అల్లరి నరేష్ సినిమా అలా పక్కన వుండిపోయింది. మహేష్ సినిమా పూర్తి అయితే తప్ప, ఈ సినిమా మీదకు రావడం, ఫినిష్ చేయడం కుదరదని బోగట్టా. అంటే జనవరి తరువాతే. అప్పుడు డేట్ లు చూసుకుని రావాలి అంటే మళ్లీ అక్కడికి మరో నెలా రెండు నెలలు పడుతుంది. అంతవరకు సినిమా వుండదు.

మహర్షి సినిమా తరువాత నరేష్ చేసే సినిమా అదే. అది అలా వుండిపోవడంతో, ఇప్పుడు కొత్త దర్శకుడు, కొత్త బ్యానర్ లో మరో సినిమా ఓకె అన్నాడు. ఏమైనా అల్లరి నరేష్ కు సరైన టైమ్ రావడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?