నిజమే.. ఇల్లు అమ్మేసా-పూరి

కొడుకుతో సినిమా తీయడం కోసం ఇల్లు అమ్మేసానని చెప్పేసారు దర్శకుడు పూరి జగన్నాధ్. పూరి జగన్నాధ్ ఇల్లు అమ్మకం పెట్టారని గ్రేట్ ఆంధ్ర ముందుగా వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు పూరి కూడా అదే కన్…

కొడుకుతో సినిమా తీయడం కోసం ఇల్లు అమ్మేసానని చెప్పేసారు దర్శకుడు పూరి జగన్నాధ్. పూరి జగన్నాధ్ ఇల్లు అమ్మకం పెట్టారని గ్రేట్ ఆంధ్ర ముందుగా వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు పూరి కూడా అదే కన్ ఫర్మ్ చేసారు. అందరూ తమ కొడుకులను లాంచ్ చేయమని నన్ను అడుగుతుంటే, నేను నా కొడుకును వేరే వాళ్ల చేతుల్లో ఎలా పెట్టను. అందుకే నేనే లాంచ్ చేసా, అందుకోసం ఇల్లు అమ్మేసా అని వివరంగా చెప్పేసాడు పూరి జగన్నాధ్. 

అన్నట్లు ఈ మెహబూబా సినిమాను నిర్మాత, పంపిణీ దారు దిల్ రాజు తన చేతుల్లోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఓసారి రఫ్ వెర్షన్ చూసిన దిల్ రాజు ఫైనల్ కాపీని ఈ రోజు చూస్తున్నట్లు తెలుస్తోంది. అలా చూసాక, సినిమాను తను తీసేసుకోవాలా? పంపిణీ చేయాలా? అలా అయితే లెక్కల సంగతేమిటి అన్నవి డిసైడ్ చేస్తారట.  

ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, మెహబూబా కనుక హిట్ అయితే తరువాత సినిమా తన బ్యానర్ లో పూరి తో చేస్తానని దిల్ రాజు మాటిచ్చి, పూరి దగ్గర మాట తీసుకున్నాడట. అంటే మెహబూబా హిట్ అయితే పూరికి అన్ని విధాలా బాగుంటుంది. తేడా వస్తే మాత్రం కష్టమే.