Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఓ వైపు షాక్.. మరోవైపు కన్ఫ్యూజన్..

ఓ వైపు షాక్.. మరోవైపు కన్ఫ్యూజన్..

లెక్కప్రకారం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాను అఫీషియల్ గా ప్రకటించాలి. అంతా ఆ ప్రకటన కోసం వెయిటింగ్. అంతలోనే రమేష్ వర్మ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ మీడియాకు ఈరోజు ప్రెస్ నోట్లు వెళ్లిపోయాయి. దీంతో అంతా షాకయ్యారు. ఇదే పెద్ద షాక్ అనుకుంటే, అంతకుమించి షాకిచ్చాడు నితిన్.

వెంకీ కుడుముల, రమేష్ వర్మ సినిమాల్ని పక్కనపెట్టేసి కొత్తగా మరో సినిమా ప్రకటించాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో చాలా రాసుకొచ్చాడు ఈ హీరో. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చేనెల నుంచి సినిమా చేస్తానని, ఆ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తాడని కూడా ప్రకటించేశాడు.

నితిన్ ట్వీట్ తో ఒక్కసారిగా అందర్లో అయోమయం. నిజంగా ఏప్రిల్ నుంచి చంద్రశేఖర్ ఏలేటి సినిమా సెట్స్ పైకి వస్తే, వెంకీ కుడుముల పరిస్థితేంటి? ఈ దర్శకుడు భీష్మ సినిమా స్క్రిప్ట్ పట్టుకొని వెయిటింగ్ లో ఉన్నాడు. ఈ కన్ఫ్యూజన్ పై ఓ క్లారిటీ రాకముందే రమేష్ వర్మ దర్శకత్వంలో మూవీ అంటూ ప్రెస్ నోట్ రావడం ఏంటి?

నితిన్ మాత్రం ఆ ట్వీట్ పెట్టి సైలెంట్ అయిపోయాడు. చివర్లో హ్యాపీ హోలీ అంటూ ముగించాడు. మరోవైపు భీష్మ ప్రాజెక్టుపై స్పందించడానికి సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మాతలు కూడా అందుబాటులోకి రాలేదు. 

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?

సీక్రెట్ గా లెటర్ రాస్తే.. ఆంధ్రజ్యోతికి ఎలా వచ్చింది.. పోసాని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?