ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ లేనట్టే

తను ఓ హిందీ సినిమా చేయబోతున్నాననే విషయాన్ని స్వయంగా ప్రభాస్ ప్రకటించాడు. చాన్నాళ్ల కిందటే ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ కు ఓకే చెప్పానని అన్నాడు. దీంతో సాహో సినిమా కంప్లీట్ అయిన…

తను ఓ హిందీ సినిమా చేయబోతున్నాననే విషయాన్ని స్వయంగా ప్రభాస్ ప్రకటించాడు. చాన్నాళ్ల కిందటే ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ కు ఓకే చెప్పానని అన్నాడు. దీంతో సాహో సినిమా కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అంతా భావించారు. కానీ ఈఏడాది ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఉండదు.

సాహో సినిమా తర్వాత తెలుగులోనే మరో మూవీ చేయబోతున్నాడు ప్రభాస్. పెదనాన్న కృష్ణంరాజుకు చెందిన బ్యానర్ లో ఓ మూవీ స్టార్ట్ చేస్తాడు. ఏప్రిల్ చివరి వారంలో ఈసినిమా ఓపెనింగ్ ఉంటుంది. రాధాకృష్ణ కుమార్ దీనికి దర్శకుడు.

సాహో సినిమా కోసం ఈనెలాఖరుకు దుబాయ్ వెళ్లబోతున్నాడు ప్రభాస్. దుబాయ్, అబుదాబి, రొమేనియాలో భారీ షెడ్యూల్స్ పూర్తిచేసి ఏప్రిల్ మూడో వారంలో హైదరాబాద్ వస్తాడు. ఆ వెంటనే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మాతగా ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభమౌతుంది.

ప్రభాస్-రాధాకృష్ణ సినిమా ఈఏడాదిలోనే కంప్లీట్ అయి, వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఆ తర్వాత ప్రభాస్ తన బాలీవుడ్ ప్లాన్స్ ను బయటకు తీసే అవకాశముంది.