వరుసగా రెండు భారీ డిజాస్టర్లు చవిచూసిన ఎన్టీఆర్ తన తాజా చిత్రాన్ని కూడా ఆపేయాలని నిర్ణయించుకున్నాడని వదంతులు వినిపించాయి. రామయ్యా వస్తావయ్యా, రభస ఫెయిల్యూర్స్తో ఎన్టీఆర్ మార్కెట్కి సీరియస్ డెంట్ పడిరది. దాంతో పూరి జగన్నాథ్తో మొదలు పెట్టిన చిత్రం షూటింగ్ని కూడా కొద్ది రోజులు వాయిదా వేసారు.
అప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని ఆపేద్దామని అనుకుంటున్నారనే గాసిప్స్ బాగా వినిపించాయి. అయితే మరొక్కసారి స్క్రిప్ట్ని రివైజ్ చేసుకుని… అంతా పక్కాగా ఉందని నమ్మకం కుదిరిన తర్వాత తిరిగి షూటింగ్ మొదలు పెట్టారు. ముందుగా అనుకున్నట్టుగా సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈసారి ఎన్టీఆర్ గురి తప్పడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈమధ్య ఎన్టీఆర్ చిత్రాల్లో తక్కువైపోయిన హీరోయిజమ్, మాస్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయట. ఎన్టీఆర్ని న్యూ లుక్తో ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా పూరి చూపిస్తున్నాడట. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, అతని గెటప్ ఎలా ఉంటుందో అనేదానిపై ఐడియా ఇవ్వడం కోసం దీపావళికి చిన్న టీజర్ వదులుతున్నారు.