నువ్వెవరో.. @15 కోట్లు

రచయిత, నిర్మాత కోనవెంకట్ సినిమాలను చాలా సైలెంట్ గా నిర్మించి, అంతకన్నా సైలెంట్ గా మార్కెట్ చేసి విడుదల చేస్తారు. పబ్లిసిటీ స్టార్ట్ అయ్యేవరకు అంతా స్మూత్ గా, సైలెంట్ గా కానిచ్చేస్తారు. ఈవారం…

రచయిత, నిర్మాత కోనవెంకట్ సినిమాలను చాలా సైలెంట్ గా నిర్మించి, అంతకన్నా సైలెంట్ గా మార్కెట్ చేసి విడుదల చేస్తారు. పబ్లిసిటీ స్టార్ట్ అయ్యేవరకు అంతా స్మూత్ గా, సైలెంట్ గా కానిచ్చేస్తారు. ఈవారం విడుదల కాబోతున్న నువ్వెవరో సినిమా అలాంటిదే. ఎమ్ వివి బ్యానర్ పై కోన కార్పొరేషన్ పార్టనర్ షిప్ తో తాస్పీ, ఆది పినిశెట్టిలతో ఓ థ్రిల్లర్ ను చకచకా తీసేసారు.

ఈ సినిమా దాదాపు 13 నుంచి 15కోట్ల బిజినెస్ చేసిందని తెలిస్తే కాస్త ఆశ్చర్యంగానే వుంటుంది. నువ్వెవరో సినిమాను ఆంధ్ర, సీడెడ్, నైజాం, కర్ణాటక, ఓవర్ సీస్ థియేటర్ రైట్స్ నే ఎనిమిది కోట్లకు పైగా విక్రయించారు. ఇక శాటిలైట్, హిందీ డబ్బింగ్, డిజిటల్ అన్నీ చేర్చుకుంటే 13కోట్లకు దాటింది బిజినెస్. ఇవికాక ఇంకా అదర్ ఏరియాల చిన్న చిన్న మొత్తాలు వుండనే వున్నాయి.

సినిమా నిర్మాణానికి పదికోట్లు ఖర్చయింది. అంటే మూడుకోట్లు టేబుల్ ప్రాఫిట్ అన్నమాట. వీటిలో నైజాం, బెంగుళూరు తన వాటాగా వుంచుకున్నారు కోనవెంకట్. ఈ సినిమాలో దాదాపు అరగంట సేపు హీరో ఆది గుడ్డివాడిగా కనిపిస్తాడు. ఆ తరువాత సినిమా ట్విస్ట్ తో మలుపు తిరుగుతుంది.