1983.. తెలంగాణ ప్రాంతం.. రాజశేఖర్ హీరో

నాని నిర్మించిన 'అ!' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఓ సెక్షన్ ఆడియన్స్ ను ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ దర్శకుడు తన రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇది కూడా…

నాని నిర్మించిన 'అ!' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ప్రశాంత్ వర్మ. ఓ సెక్షన్ ఆడియన్స్ ను ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ దర్శకుడు తన రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇది కూడా దాదాపు ఓ ప్రయోగాత్మక చిత్రమనే చెప్పాలి. ఆ సినిమా స్టోరీలైన్ ను కూడా రివీల్ చేశాడు ఈ దర్శకుడు. 

1983 కాలానికి చెందిన కథను సిద్ధం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అది కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. ఇప్పటివరకు తెలుగుతెరపై ఇలాంటి కథ, ఇలాంటి సినిమా రాలేదంటున్నాడు. ఈ సినిమా కోసం తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసే మాటల రచయిత కూడా కావాలంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

'అ!' తర్వాత తన నెక్ట్స్ సినిమాను రాజశేఖర్ తో చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ విషయాన్ని రాజశేఖర్ కూడా అఫీషియల్ ఎనౌన్స్ చేశాడు. అంటే.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ వర్క్ చేస్తున్న ఈ 1983 నాటి తెలంగాణ కథ రాజశేఖర్ కోసమే అన్నమాట. 

'అ!' సినిమాతో ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ ను టాలీవుడ్ ప్రేక్షకులకు అందించిన ఈ దర్శకుడు, తన రెండో ప్రయత్నంగా ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి. గరుడవేగ సక్సెస్ తర్వాత రాజశేఖర్ చేయబోతున్న సినిమా ఇదే.