అక్టోబర్ 7 – ధృవ డేట్ ఫిక్స్

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కూల్ ప్రీత్ సింగ్ జంట‌గా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న ' ధృవ'  విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.  సెప్టెంబ‌ర్ 5 నాటికి టోట‌ల్ టాకీ…

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కూల్ ప్రీత్ సింగ్ జంట‌గా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న ' ధృవ'  విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.  సెప్టెంబ‌ర్ 5 నాటికి టోట‌ల్ టాకీ కంప్లీట్ చేస‌కుని మిగిలిన సాంగ్స్ ని కూడా అదే నెల‌లో పూర్తి చేస్తారట. ఆల్ రెడీ పోస్ట్ ప్రోడ‌క్షన్ కార్యక్రమాలు కూడా సమాంతరంగా ఫినిష్ చేస్తున్నారట. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబ‌ర్ 7న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌తో పాటు అర‌వింద్ స్వామి ఫెర్‌ఫార్మెన్స్ హైలెట్ గా నిలుస్తుంది. తమిళ చిత్రం థని ఒరువన్ ఈ సినిమాకు మాతృక.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత‌ల్లో ఓక‌రైన‌ అల్లు అరవింద్ మాట్లాడుతూ…. రాంచరణ్ , ర‌కూల్ ప్రీత్ సింగ్‌, సురేందర్ రెడ్డి కాంబినేష‌న్ లో  గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ' ధృవ'  చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'ధృవ' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశాం. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది.. పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ కథాంశంతో కూడిన కథ కావడం, దానికి తగ్గట్టుగా రాంచరణ్ తన బాడీ లాంగ్వేజ్, లుక్స్ మార్చుకున్నాడు. 

ఏమాత్రం డిలే లేకుండా షూటింగ్ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 5 నాటికి  సాంగ్స్‌ మిన‌హ టోట‌ల్ టాకీ ఫినిష్ అవుతుంది. మ‌రో ప‌క్క శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ఎక్కడా చిన్న డిలే లేకుండా అనుకున్న విధంగానే అక్టోబ‌ర్ 7న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్నాము . అని అన్నారు.