పన్నెండు కోట్లుంటేనే రిలీజ్‌?

కృష్ణవంశీ, నానిల ‘పైసా’కి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని, నవంబర్‌ 29న విడుదల కానుందని వార్తలొచ్చాయి. అయితే ఈ చిత్రానికి ఉన్న సమస్యలు ఏమీ తొలగలేదని, ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నాయని, నిర్మాత పన్నెండు…

కృష్ణవంశీ, నానిల ‘పైసా’కి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని, నవంబర్‌ 29న విడుదల కానుందని వార్తలొచ్చాయి. అయితే ఈ చిత్రానికి ఉన్న సమస్యలు ఏమీ తొలగలేదని, ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నాయని, నిర్మాత పన్నెండు కోట్లకి పలువురు ఫైనాన్షియర్లకి బకాయి పడ్డారని, అవి చెల్లిస్తే తప్ప పైసా రిలీజ్‌ కాదని ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. 

ఈ సమస్యలు తీరి పైసా విడుదల కావాలంటే అంత త్వరగా జరిగేది కాదని, డిసెంబర్‌లో కూడా ఈ చిత్రం వెలుగు చూడకపోవచ్చునని టాక్‌ ఉంది. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాని మరి కొన్నాళ్లు దీని విడుదల కోసం వేచి చూడక తప్పదిక. మరోవైపు ఇలాగే ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ ఆటోనగర్‌ సూర్య మాత్రం బ్యాలెన్స్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. 

డిసెంబర్‌ మూడవ వారంలో ఈ చిత్రం విడుదల కావచ్చునని తెలిసింది. మరి పైసా కనీసం సంక్రాంతికి అయినా బయట పడుతుందో లేదో అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఎన్ని విడుదల ప్రకటనలు వచ్చినా సినిమా వచ్చే వరకు నమ్మక్కర్లేదని అంటున్నారు.