Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పరుచూరి కథతో బాలయ్య సినిమా

పరుచూరి కథతో బాలయ్య సినిమా

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత మళ్లీ మేకప్ వేసుకునే టైమ్ వచ్చింది నందమూరి బాలకృష్ణకు. దాదాపు నెల రోజులుగా వార్తల్లో నానుతున్న సి కళ్యాణ్-కేఎస్ రవికుమార్ ప్రాజెక్టు ఫైనల్ అయింది. ఈనెల 13న ఈ సినిమాకు పూజ నిర్వహించబోతున్నారు.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే సెట్ మీదకు వెళ్లాలి. కానీ కథ విషయంలో సమస్య వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో వైఎస్ జగన్ ను విలన్ గా స్ఫురింపచేస్తూ ఓ కథ అల్లుకున్నారు. అంతేకాదు వైఎస్ రాజారెడ్డి క్యారెక్టర్ గుర్తుకువచ్చేలా కూడా ఓ పాత్రను రాసుకున్నారు. 

కానీ ఎప్పుడయితే వైఎస్ జగన్ అఖంఢ మెజారిటీతో గెలుపు సాధించడంతో ఆ కథను మూలన పడేసారు. కొత్త కథ కోసం అన్వేషణలు సాగాయి. ఆఖరికి దర్శకుడు పరుచూరి మురళి చెప్పిన ఓ కథను బాలయ్య ఒకె చేసారు. ఈ కథలో కూడా హీరో పోలీస్ అధికారినే. అక్టోబర్ నాటికి ఈసినిమాను ఫినిష్ చేసే ఉద్దేశంతో ప్లానింగ్ చేస్తున్నారు. 13న పూజ చేసి, జూలై నుంచి సెట్ మీదకు వెళ్తారు.

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?