‘పటాస్‌’ పోరీకి ఇంకో ఛాన్స్‌

‘పటాస్‌’ ఫేం శృతి సోదికి ఇంకో సినిమాలో ఛాన్స్‌ దొరికింది. సాయికుమార్‌ తనయుడు ఆది హీరోగా ‘పూలరంగడు’ ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో అనిల్‌ సుంకర నిర్మించనున్న సినిమాలో హీరోయిన్‌గా శృతి సోదిని ఎంపిక…

‘పటాస్‌’ ఫేం శృతి సోదికి ఇంకో సినిమాలో ఛాన్స్‌ దొరికింది. సాయికుమార్‌ తనయుడు ఆది హీరోగా ‘పూలరంగడు’ ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో అనిల్‌ సుంకర నిర్మించనున్న సినిమాలో హీరోయిన్‌గా శృతి సోదిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

తొలి సినిమా ‘పటాస్‌’తోనే మంచి విజయాన్ని అందుకుంది శృతి సోది. నటన పరంగా పెద్దగా స్కోర్‌ చేయలేకపోయినా, గ్లామర్‌ విషయంలో పెద్దగా మొహమాటాలేవీ ప్రదర్శించకపోవడంతో, ‘పటాస్‌’ సినిమాతో గ్లామరస్‌ హీరోయిన్‌గా ఆమెకు ఓ మోస్తరు మార్కులు పడ్డాయి. దాంతోపాటు, తొలి సినిమా హిట్‌ అవడంతో గోల్డెన్‌ లెగ్‌ ఇమేజ్‌ కూడా అప్పుడే వచ్చేసిందట ఈమెకి.

అసలే టాలీవుడ్‌కి సెంటిమెంట్లు ఎక్కువ. సక్సెస్‌ కొట్టిన హీరోయిన్‌కి అవకాశాలు తేలిగ్గానే దొరుకుతాయి. అన్నట్టు, తొలి సినిమాతో హిట్‌ కొట్టిన శృతి సోది, రెండో సినిమాతోనూ హిట్‌ కొడ్తాననే ధీమాతో వుంది. తెలుగులో నిలదొక్కుకోవడంపైనే దృష్టిపెడ్తాననీ, ప్రస్తుతానికి తన దృష్టి టాలీవుడ్‌ మీద తప్ప, వేరే ఆఫర్స్‌ గురించి ఆలోచించడంలేదని శృతి చెబుతోంది.