Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ సినిమాలు ఇక స్వంతమేనా?

పవన్ సినిమాలు ఇక స్వంతమేనా?

సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత సూర్య డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు నిర్మాత మళ్లీ శరద్ మురారే అని పవన్ నే స్వయంగా చెప్పాడు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా వుంటుందని వినికిడి. దీనికి కూడా శరద్ నే నిర్మాత అని తెలుస్తోంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్ తన రాజకీయ రంగ ప్రవేశం చేసే లోపు చేసే సినిమాలపై కాస్త డబ్బలు చేసుకోవాలన్న ఆలోచనే అని తెలుస్తోంది.

నిజానికి త్రివిక్రమ్.. పవన్ కలిసి మైత్రీ మూవీస్ కు ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ చేయడం లేదని, అడ్వాన్స్ లు వెనక్కు వెళ్లాయని వినికిడి. త్రివిక్రమ్ కూడా తన సినిమాల లాభాల్లో వాటా తీసుకుంటారు అన్న వదంతి వుంది. సో త్రివిక్రమ్.. పవన్.. శరద్ కలిసే ఆ సినిమా నిర్మిస్తారని వినికిడి.

ఇక్కడ ఇంకో వదంతి కూడా వినిపిస్తోంది.. త్రివిక్రమ్ కు ఇష్టమైన హోమ్ బ్యానర్ హారిక హాసిని ని పవన్ కు జతచేసే అవకాశం వుందన్నది ఆ వదంతి సారాంశం. ఆ బ్యానర్ పైనే త్రివిక్రమ్-సూర్య సినిమా కూడా వుంటుందన్న సంగతి తెలిసిందే. సో త్రివిక్రమ్.. చిన్నబాబు.. పవన్ .. శరద్ లా కొత్త కలయిక వుండొచ్చన్న మాట.

పవన్ గతంలో పివిపి కి ఓ సినిమా చేయాలి.. ఆ అడ్వాన్స్ కూడా గతంలోనే సగం వెనక్కు ఇచ్చారు. తరువాత మిగిలినది సెటిల్ చేసారని వినికిడి. మరి దాసరి నిర్మాతగా సినిమా అంటున్నారు. నిజంగా దాసరి అంత అద్భుతమైన కథ తెస్తే.. అప్పుడు వుంటుంది లేదూ అంటే లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?