పవన్, ప్రభాస్, మహేష్ కు అడ్వాన్సులు

టాలీవుడ్ లో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏకంగా 12ప్రాజెక్టుల్ని ప్రకటించింది. వీటిలో రంగస్థలం, సవ్యసాచి సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. త్వరలోనే నాని, విజయ్ దేవరకొండ సినిమాలు ప్రారంభమౌతాయి. ఇవి…

టాలీవుడ్ లో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏకంగా 12ప్రాజెక్టుల్ని ప్రకటించింది. వీటిలో రంగస్థలం, సవ్యసాచి సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. త్వరలోనే నాని, విజయ్ దేవరకొండ సినిమాలు ప్రారంభమౌతాయి. ఇవి కాకుండా.. కొంతమంది హీరోలకు అడ్వాన్సులు ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. 

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ ను మరోసారి సెట్ చేసింది ఈ సంస్థ. ఈ మేరకు ఇప్పటికే ఈ ఇద్దరికీ అడ్వాన్సులు అందించింది. వచ్చే ఏడాది ఆగస్ట్ లో సినిమా ప్రారంభమయ్యే అవకాశముంది. అటు ప్రభాస్, పవన్ కూడా మైత్రీ నుంచి ఎమౌంట్ అందుకున్నారు. ప్రభాస్ సినిమాకు డైరక్టర్ ఇంకా ఫిక్స్ కాలేదు. పవన్ సినిమాకు మాత్రం సంతోష్ శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది.

పవన్, ప్రభాస్, మహేష్ తో పాటు ఈ నిర్మాణ సంస్థ లిస్ట్ లో రవితేజ, అఖిల్, సాయిధరమ్ తేజ్ కూడా ఉన్నారు. వీళ్లతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తోంది సదరు సంస్థ. ఓవరాల్ గా రంగస్థలంతో కలిపి 12ప్రాజెక్టులు ఎనౌన్స్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్.