పవన్ మళ్లీ మరో సినిమా

అయిపోయింది. జనాలకు రూఢీ అయిపోతోంది. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మరో మూడేళ్ల పాటు పవర్ స్టార్ గానే వుండదల్చుకున్నారు. ఎన్నికలు ఏడాది వుందనగా మళ్లీ రాజకీయాల్లోకి గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తారు. అప్పటి దాకా సినిమాలు…

అయిపోయింది. జనాలకు రూఢీ అయిపోతోంది. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మరో మూడేళ్ల పాటు పవర్ స్టార్ గానే వుండదల్చుకున్నారు. ఎన్నికలు ఏడాది వుందనగా మళ్లీ రాజకీయాల్లోకి గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తారు. అప్పటి దాకా సినిమాలు చేసుకుంటూ సినిమాకు యాభై కోట్ల వంతున వెనకేసుకునే కార్యక్రమం చేపట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే పింక్ రీమేక్, క్రిష్ సినిమాల షూటింగ్ లు చకచకా చేస్తున్న పవన్ కళ్యాణ్ మరో సినిమాను ప్రకటించేసారు.

గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే సినిమాలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు. ఈ మేరకు యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. నిజానికి మైత్రీ మూవీస్ తో పవన్ కళ్యాణ్ సినిమా అన్నది ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. వాస్తవానికి ఆ సినిమానే ముందు చేయాలి కూడా.

కానీ మధ్యలో దిల్ రాజు నిర్మించే పింక్ రీమేక్ అన్నది వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకుంది. దాంతో ఇది వెనక్కు వచ్చింది.  ప్రస్తుతం పింక్ రీమేక్ ను ఫినిష్ చేసి, ఆ తరువాత 2021లో విడుదల దిశగా క్రిష్ సినిమాను పూర్తి చేస్తారు. ఈ ఏడాది లోనే హరీష్ శంకర్ సినిమా కూడా మొదలవుతుంది కానీ, విడుదల వచ్చే ఏడాది సమ్మర్ కే అనుకోవాలి. 

అందువల్ల పవన్ తో ఇంకెవరైనా సినిమా చేయాలంటే ఆ తరువాత స్లాట్ కు ట్రయ్ చేసుకోవచ్చు. బహుశా పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ఆ స్లాట్ ను అందుకుంటారేమో?

ఈ రికార్డులు ఎవ‌రైనా బ్రేక్ చేస్తే చూడాల‌ని వుంది