సగం సినిమా అయింది.. గ్యాప్ తీసుకుంటారట!

పవన్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇప్పటికిప్పుడు హడావుడిగా షూటింగ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెప్టెంబర్ లో రిలీజ్ అనుకున్న సినిమాను సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. సో.. కూల్ గా షూటింగ్ చేసుకోవచ్చు.…

పవన్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇప్పటికిప్పుడు హడావుడిగా షూటింగ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెప్టెంబర్ లో రిలీజ్ అనుకున్న సినిమాను సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. సో.. కూల్ గా షూటింగ్ చేసుకోవచ్చు. అందుకేనేమో ఇప్పుడు పవన్, త్రివిక్రమ్ కలిసి ఒకేసారి షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారు.

సినిమా షూటింగ్ ను ఇప్పటికే 50 శాతం కంప్లీట్ చేసిన పవన్-త్రివిక్రమ్, కొన్ని వారాలు పాటు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారట. దీనికి ఓ కారణం ఉంది. వీళ్లిద్దరూ నిర్మాతలుగా నితిన్ తో ఓ సినిమా లాంచ్ చేశారు. జులైలో ఆ మూవీని సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారు. ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, దాన్ని గాడిలో పెట్టిన తర్వాత మళ్లీ తమ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.

అటు పవన్ కూడా మరోసారి పొలిటికల్ గా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. జనసేన పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసే చర్యలతో పాటు, ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి భారీస్థాయిలో తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. కాబట్టి తాజా పరిణామాలు చూస్తుంటే గ్యాప్ తప్పదనిపిస్తోంది.