Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ - మైత్రీ డబ్బులు వెనక్కు..?

పవన్ - మైత్రీ డబ్బులు వెనక్కు..?

చిరకాలంగా వార్తల్లోనే వుంటూ వస్తున్న సినిమా మైత్రీ మూవీస్-పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ మూవీ. ఈ మూవీ కోసం హరీష్ శంకర్ కథ చెప్పి పవన్ ను ఒప్పించలేకపోయారని వార్తలు వస్తూనే వున్నాయి. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్… ఓ కాన్సెప్ట్ పోస్టర్ మాత్రం బయటకు వచ్చాయి. అంతకు మించి ఈ సినిమా అంగుళం కూడా ముందుకు జ‌రగలేదు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్టు ఇక లేనట్లే అని వార్తలు వినిపించడం మొదలైంది.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, ఈ సినిమా ఇక వుండదని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో చేతిలో వున్న హరి హర వీరమల్లు సినిమా ఒక్కటే పూర్తి చేసే ఆలోచనలో పవన్ వున్నట్లు తెలుస్తోంది. అందువల్ల మైత్రీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కు ఇచ్చేస్తారని బోగట్టా. అయితే ఇన్నేళ్ల తరువాత మరి అడ్వాన్స్ వెనక్కు ఇవ్వడం అంటే వడ్డీ కూడా ఇవ్వాల్సి వుంటుంది. వడ్డీ ఇస్తారో? మైత్రీ సంస్థ మొహమాటానికి పోయి వదిలేస్తుందో చూడాలి.

భవదీయుడు భగత్ సింగ్ ఆగిపోవడంతో దర్శకుడు హరీష్ శంకర్ తో ఆల్టర్ నేటివ్ ప్రాజెక్టు చేయడానికి మైత్రీ సంస్థ సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నుంచి టాలీవుడ్ హీరో విజ‌య్ దేవరకొండ వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా ఎక్కడా ఏదీ ఫైనల్ కాలేదు. 

విజ‌య్ కు ఇంకా కథ చెప్పలేదు. కథ చెప్పాలి..ఒకె అనాలి. ఇదే సమయంలో విజ‌య్ దేవరకొండతో సినిమా కోసం గీతా, దిల్ రాజు, సితార సంస్థలు కూడా కథలు రెడీ చేస్తున్నాయి. వీటిని మించిన కథను హరీష్ శంకర్ చెప్పాల్సి వుంటుంది. అదే అతి పెద్ద టాస్క్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?