Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పిలుపు లేదు...మీటింగ్ వుందా?

పిలుపు లేదు...మీటింగ్ వుందా?

టాలీవుడ్ పెద్దలతో ఆంధ్ర సిఎమ్ మీటింగ్...టాలీవుడ్ పెద్దలకు ఆంధ్ర సిఎమ్ నుంచి ఆహ్వానం. ఇలాంటి టైటిళ్లు ఈ మధ్య ఒకటికి రెండు సార్లు కనిపిస్తున్నాయి. కానీ నిజం ఏమిటంటే అసలు అలాంటి పిలుపు రాకపోవడం. కొన్నిరోజుల క్రితం ఇలాగే పిలుపు వచ్చేసింది. మీటింగ్ అన్నారు. 

నిజానికి అలాంటి పిలుపు ఏదీ రాలేదని టాలీవుడ్ పెద్దలకు తెలుసు. కానీ పిలుపు రాలేదని చెప్పుకోవడం కన్నా, వచ్చిందన్న గ్యాసిప్ బెటర్ అని గప్ చుప్ గా ఊరుకున్నారు. మొత్తానికి ఆ డేట్ అలా దాటిపోయింది.

ఇప్పుడు లేటెస్ట్ గా మళ్లీ 20వ తేదీ అనే డేట్ ఒకటి బయటకు వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే టముకు వేసింది. నిజానికి మెగాస్టార్ నో, మరొకరినో అడిగితే అలాంటి పిలుపు ఏదీ రాలేదని తెలిసి వుండేది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి వరకు ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు టాలీవుడ్ పెద్దలకు కానీ చాంబర్ కు కానీ కౌన్సిల్ కు కానీ రాలేదు.

ప్రస్తుతం చిరంజీవి తన ఆచార్య పాట షూట్ లో ఫుల్ బిజీగా వున్నారు. 18 వరకు ఇదే పాట షెడ్యూలు వుంటుంది. ఆ తరువాత 21న బయల్దేరి ఊటీ వెళ్తారు. అక్కడ లూసిఫర్ షూట్ వుంటుంది. 28 వరకు అక్కడే వుంటారు. అందువల్ల ఆంధ్రకు వెళ్లి కలవాలి అంటే మిగిలిన డేట్ లు రెండే 19, 20. మరి ఈ మేరకు పిలుపు వస్తుందా? అన్నది చూడాలి. 

అలా రాకపోతే మళ్లీ అదో సమస్య. 21 తరువాత పిలుపు వస్తే లూసిఫర్ షూట్ క్యాన్సిల్ చేసుకుని విజయవాడ పరుగెత్తాలి. అందువల్ల 19, 20ల్లోనే పిలుపు రావాలని కోరుకుంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?