శ్రద్ధా కపూర్ సినిమాకు ప్రభాస్ ప్రచారం?

సాహో సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది శ్రద్ధాకపూర్. ఆమె ఇంకా సాహో సినిమా సెట్స్ పైకి రాలేదు. కానీ ప్రభాస్, శ్రద్ధ మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అయింది. ఇద్దరూ తరచుగా ఫోన్ లో…

సాహో సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది శ్రద్ధాకపూర్. ఆమె ఇంకా సాహో సినిమా సెట్స్ పైకి రాలేదు. కానీ ప్రభాస్, శ్రద్ధ మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అయింది. ఇద్దరూ తరచుగా ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. మరోవైపు శ్రద్ధా కపూర్ తెలుగు, ప్రభాస్ హిందీ నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. సాహో కంటే ముందే శ్రద్ధ, ప్రభాస్ కలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్ లో హసీనా పార్కర్ అనే సినిమా చేస్తోంది శ్రద్ధాకపూర్. సెప్టెంబర్ 22న విడుదల కానున్న ఈ సినిమాలో దావూద్ ఇబ్రహీం చెల్లెలి పాత్రలో శ్రద్ధకపూర్ కనిపించనుంది. తెలుగులో ఈ సినిమా ప్రమోషన్ కు ప్రభాస్ ను రంగంలోకి దించబోతున్నారని టాక్. శ్రద్ధకపూర్ రిక్వెస్ట్ చేయడంతో హసీనా పార్కర్ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రచారం కల్పించేందుకు ఒప్పుకున్నాడట ప్రభాస్. 

హసీనా పార్కర్ థియేటర్లలోకి వచ్చిన వెంటనే సాహో సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుంది శ్రద్ధకపూర్. అలా తన సినిమా కంటే ముందు శ్రద్ధ కపూర్  సినిమాకు ప్రచారం చేయబోతున్నాడు ప్రభాస్.