తన స్టయిల్ లో స్పందించిన పూరిజగన్నాథ్

టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే మీడియాలో కొన్ని పేర్లు ప్రత్యక్షం కాగా, వాళ్లలో చాలామంది దీనిపై రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు దీంతో తమకు…

టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే మీడియాలో కొన్ని పేర్లు ప్రత్యక్షం కాగా, వాళ్లలో చాలామంది దీనిపై రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు దీంతో తమకు సంబంధం లేదని మాత్రమే ప్రకటించారు. తాజాగా ఈ రియాక్షన్ లిస్ట్ లోకి పూరిజగన్నాథ్ కూడా ఎంటరయ్యాడు. అయితే అందర్లా కాకుండా డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యాడు.

ఇప్పటివరకు నేను ఎవరిపైనా, దేనిపైనా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం పైసావసూల్ సినిమాను కంప్లీట్ చేయడంలో నేను చాలా బిజీగా ఉన్నాను. పూరిజగన్నాథ్ లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. తను దేనిపై ఎవరిపై స్పందించనంటూనే స్పందించాడు పూరి.

ఈ వివాదంపై పూరిజగన్నాథ్ ఎంత కోపంగా ఉన్నాడనే విషయం ఈ ట్వీట్ చూస్తేనే అర్థమౌతోంది. తాజా సమాచారం ప్రకారం, డ్రగ్స్ వివాదంలో ఎక్సైజ్ పోలీసులు పూరిజగన్నాథ్ కు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అతడికి నచ్చిన ప్రాంతంలోనే ప్రశ్నించేందుకు పోలీసులు ఒప్పుకున్నారట.