నీకు ఆ పిల్ల అవసరమా.. పూరిపై ట్రోలింగ్

నిన్న రాత్రి నుంచి పూరి జగన్నాధ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనికి కారణం అను ఎమ్మాన్యుయేల్. అవును.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్…

నిన్న రాత్రి నుంచి పూరి జగన్నాధ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనికి కారణం అను ఎమ్మాన్యుయేల్. అవును.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను తీసుకోబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇలా గాసిప్స్ స్టార్ట్ అయిన వెంటనే అలా డైరక్టర్ పూరిపై ట్రోలింగ్ షురూ అయింది.

మజ్ను సినిమా తప్పితే, కెరీర్ లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టని ఐరెన్ లెగ్ అనును ఎలా తీసుకుంటారని పూరి జగన్నాధ్ ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అజ్ఞాతవాసి, నాపేరు సూర్య లాంటి డిజాస్టర్ మూవీస్ లో నటించిన అను ఎమ్మాన్యుయేల్ కు ఇండస్ట్రీ మొత్తం దూరంగా జరుగుతుంటే.. పూరి-చార్మి మాత్రం ఏరికోరి ఆమెను తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

తక్కువ రెమ్యునరేషన్ కు వస్తోందని ఆమెను తీసుకుంటే భారీ మూల్యం చెప్పించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రామ్ ను హెచ్చరించే బ్యాచ్ కూడా రెడీ అయింది. పూరి జగన్నాధ్ మాయలో పడొద్దని, హీరోయిన్ల ఎంపిక విషయంలో సొంతగా నిర్ణయం తీసుకోవాలని, అవసరమైతే పెదనాన్న రవికిషోర్ సలహాలు తీసుకోవాలని రామ్ కు సూచిస్తున్నారు.

డబ్బులు మిగుల్చుకోవడం కోసం కొత్త హీరోయిన్లను, తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లను పూరి జగన్నాధ్ తన సినిమాల్లోకి తీసుకుంటాడని ఆరోపిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ నడుస్తోంది. ఇందులో సెకెండ్ హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకున్నారు.

అదుగో, నన్ను దోచుకుందువటే సినిమాల్లో నటించింది నభా. ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తయింది. మెయిన్ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అను ఎమ్మాన్యుయేల్ ను మాత్రం తీసుకోవద్దనేది నెటిజన్ల డిమాండ్.

బాలయ్యకు మత్తు దిగిందా!

బ్యాంకులో వేస్తే 20 లక్షలు.. సినిమా ఆడిస్తే 10 లక్షలే