క్యూ కడుతున్న టాలీవుడ్‌ సీక్వెల్స్‌

సీక్వెల్‌ సాంప్రదాయాన్ని మన తెలుగు చిత్ర పరిశ్రమ అంతగా ఫాలో కాదు. ఇంతవరకు వచ్చిన సీక్వెల్స్‌లో చాలా వరకు ఫెయిల్‌ కావడంతో ఆ దిశగా ఎక్కువ మంది దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు సీక్వెల్‌…

సీక్వెల్‌ సాంప్రదాయాన్ని మన తెలుగు చిత్ర పరిశ్రమ అంతగా ఫాలో కాదు. ఇంతవరకు వచ్చిన సీక్వెల్స్‌లో చాలా వరకు ఫెయిల్‌ కావడంతో ఆ దిశగా ఎక్కువ మంది దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు సీక్వెల్‌ ట్రెండ్‌ నెమ్మదిగా టాప్‌ గేర్‌లోకి చేరుకుంటోంది. ‘గబ్బర్‌సింగ్‌’ సీక్వెల్‌ చేయడానికి పవన్‌కళ్యాణ్‌ రంగం సిద్ధం చేసుకున్నాడు. 

ఎన్టీఆర్‌తో ‘అదుర్స్‌’ సీక్వెల్‌ చేయడానికి వి.వి. వినాయక్‌ అండ్‌ కో కృషి చేస్తున్నారు. మహేష్‌బాబుతో పూరి జగన్నాథ్‌ తలపెట్టిన ‘పోకిరి 2’ మళ్లీ డిస్కషన్‌లోకి వస్తోంది. ఇంకా ఈ చిత్రం టాక్స్‌లో ఉందని మహేష్‌ స్పష్టం చేసాడు. అలాగే సురేందర్‌తో కిక్‌ 2 చేయడానికి రవితేజ ఆల్రెడీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడు. బాలీవుడ్‌లో ఫ్రాంచైజీలు చాలానే వస్తూ అన్నీ సక్సెస్‌ అవుతున్నాయి. 

కథలు లేవని గోల పెడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సీక్వెల్‌ ట్రెండ్‌ క్లిక్‌ అయితే అప్పుడు చాలా చిత్రాలకి సీక్వెల్స్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. తద్వారా ఎక్కువ విజయాల్ని కూడా నమోదు చేసుకోవచ్చు. కథల కోసం ఇబ్బంది పడే హీరోలు ఫ్రాంఛైజీలని నమ్ముకుంటే గ్యాప్‌ లేకుండా సినిమాలు చేసుకోవడానికి కూడా స్కోప్‌ పెరగవచ్చు.