కొత్త ఏడాదిలో కొత్త సినిమాలు

స్పైడర్ ఫ్లాప్ తర్వాత మళ్లీ తెలుగులో కొత్త ప్రాజెక్టులు ప్రకటించలేదు రకుల్ ప్రీత్ సింగ్. హిందీ, తమిళ భాషలపైనే ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో మరో సినిమాకు ఓకే చెప్పడంతో పాటు, తమిళ్ లో…

స్పైడర్ ఫ్లాప్ తర్వాత మళ్లీ తెలుగులో కొత్త ప్రాజెక్టులు ప్రకటించలేదు రకుల్ ప్రీత్ సింగ్. హిందీ, తమిళ భాషలపైనే ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో మరో సినిమాకు ఓకే చెప్పడంతో పాటు, తమిళ్ లో సూర్య సరసన నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఇక తెలుగులో సినిమాలు తగ్గించేస్తుందని కొందరు భావించారు. కానీ రకుల్ ఈ ఏడాది కూడా తెలుగులో బిజీ కాబోతోంది.

ప్రస్తుతం ఆమె చేతిలో 2-3 క్రేజీ ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఒకటి నాని-నాగార్జున మల్టీస్టారర్ మూవీ. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నాని సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది.

నితిన్, శర్వానంద్ హీరోలుగా దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు దాగుడు మూతలు అనే టైటిల్ పెట్టాడు. ఈ మూవీలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రకుల్.

ఈ రెండు సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టు కూడా రకుల్ చేతిలో ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేయాల్సిన సినిమాలో మొన్నటివరకు పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడామె స్థానంలో రకుల్ ను తీసుకోవాలనుకుంటున్నారట.