Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్‌ సై అనేసాడు

రామ్‌ సై అనేసాడు

తమిళంలో ధనుష్‌ హీరోగా నటించిన ‘వేల ఇల్లా పట్టదారి’ (విఐపి) ఘన విజయం సాధించింది. దానిని తెలుగులో రీమేక్‌ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ హీరో ఎవరనేది తేలక పోవడంతో ఆలస్యం జరిగింది. దాంతో ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి విడుదల చేద్దామని కూడా అనుకున్నారు. 

అయితే ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని రామ్‌ డిసైడ్‌ అయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ చిత్రం చూసిన రామ్‌, అతని పెదనాన్న స్రవంతి రవికిషోర్‌.. ‘విఐపి’ని రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నారట. రీమేక్‌ హక్కులని రవికిషోర్‌ సొంతం చేసుకున్నారు. రామ్‌ హీరోగా స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పైనే ఈ చిత్రం రూపొందుతుంది. 

ప్రస్తుతం రామ్‌ హీరోగా ‘పండగ చేస్కో’ చిత్రం నిర్మాణంలో ఉంది. ఈమధ్య రామ్‌ నటించిన సినిమాలు చాలా వరకు మిస్‌ ఫైర్‌ అవడంతో అతను ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. విఐపి రీమేక్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి కూడా రామ్‌ బాగా ఆలోచించి... ఫైనల్‌గా పచ్చ జెండా ఊపేసాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?