Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ తో మళ్లీ కిషోర్ తిరుమల

రామ్ తో మళ్లీ కిషోర్ తిరుమల

స్లంప్ లోకి దిగుతున్న హీరో రామ్ కు నేను శైలజ సినిమాతో మాంచి హిట్ ఇచ్చాడు కిషోర్ తిరుమల. తొలి సినిమా సక్సెస్ తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత చాలా మంది ఆఫర్లు ఇచ్చారు. నితిన్ తో సినిమా ఫైనల్ అనుకున్నారు. కానీ విక్టరీ వెంకటేష్ తో మలి సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. 

ప్రస్తుతం వెంకీ తన గురు సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాను నవంబర్ ఎండింగ్ కే ఫినిష్ చేసేస్తాడట. ఎందుకంటే గురు సినిమాకు వెంకీ కాల్ షీట్లు చాలా తక్కువేనట. ఆ వెంటనే కిషోర్ తిరుమల సినిమా పట్టాలెక్కేస్తుందట. అందుకే తన మూడోసినిమాకు కూడా కిషోర్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోతున్నాడు. 

తనకు తొలి చాన్స్ ఇచ్చిన హీరో రామ్ తోనే మూడో సినిమా చేయబోతున్నాడు. వెంకీ సినిమా ఫినిష్ కాగానే ఈ సినిమా సెట్ మీదకు వెళ్లిపోతుంది. ఇప్పుడు దొరికిన గ్యాప్ లో ఆ సినిమాకు కూడా స్క్రిప్ట్ ప్రిపరేషన్ లో కిషోర్ బిజీగా వున్నాడు.ఈ సినిమాను స్రవంతి బ్యానర్ పై రవికిషోర్ నిర్మిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?