అక్టోబర్ నుంచి చరణ్, ఎన్టీఆర్ సినిమా?

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది అక్టోబర్ నుంచి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు రామ్ చరణ్ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేశాడట.…

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది అక్టోబర్ నుంచి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు రామ్ చరణ్ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేశాడట. అక్టోబర్ నుంచి రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నాడట.

మరో వారం రోజుల్లో రంగస్థలం షూటింగ్ పూర్తిచేయబోతున్నాడు చరణ్. ఆ వెంటనే బోయపాటి సినిమా సెట్స్ పైకి షిఫ్ట్ అవుతాడు. ఏకథాటిగా జరిగే షెడ్యూల్స్ తో బోయపాటి సినిమాను కంప్లీట్ చేసి, అక్టోబర్ నుంచి రాజమౌళి సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు. ఈ మేరకు రాజమౌళికి సమాచారం అందించాడట చెర్రీ.

అటు ఎన్టీఆర్ కాల్షీట్లపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ తో చేయాల్సి సినిమా లెక్కప్రకారం మరో 2వారాల్లో సెట్స్ పైకి రావాలి. కానీ ఆ మూవీకి సంబంధించి రీవర్క్ జరుగుతోంది. అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో కథ, స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేస్తున్నారు. కాబట్టి మార్చి వరకు ఇది సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు. ఈ మూవీ ఓ షెడ్యూల్ జరిగితే తప్ప, ఎన్టీఆర్ కాల్షీట్లపై క్లారిటీ రాదు.

ఈ లోగా రామ్ చరణ్ తో షూటింగ్ స్టార్ట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రీన్ ప్లే లాక్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో ఎడతెగని చర్చలు సాగిస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఇంకా ఫైనల్ నెరేషన్ వినిపించలేదు.