ర్యాంప్‌పై ‘ఐశ్వర్యం’…

చాన్నాళ్ల తర్వాత ఐశ్వర్యారాయ్ బచ్చన్… ఫ్యాషన్ షోలో పాల్గొననుంది. దాదాపు ఐదారు సంవత్సరాల తర్వాత ఆమె ర్యాంప్ వాక్ చేయనుండడంతో జులై నెలాఖరులో జరుగనున్న ఈ ఈవెంట్‌కి ఇంపార్టెన్స్ ఏర్పడింది. కొన్ని నెలల క్రితం…

చాన్నాళ్ల తర్వాత ఐశ్వర్యారాయ్ బచ్చన్… ఫ్యాషన్ షోలో పాల్గొననుంది. దాదాపు ఐదారు సంవత్సరాల తర్వాత ఆమె ర్యాంప్ వాక్ చేయనుండడంతో జులై నెలాఖరులో జరుగనున్న ఈ ఈవెంట్‌కి ఇంపార్టెన్స్ ఏర్పడింది. కొన్ని నెలల క్రితం నిర్వహించిన మిజ్వాన్ అనే ఫ్యాషన్ షోలో ఐశ్వర్య పాల్గొంటుందని పెద్ద యెత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ షోకి ఐష్ డుమ్మా కొట్టింది. 

అమితాబ్, అభిషేక్, జయాబచ్చన్ సహా తన కుటుంబం అంతా ర్యాంప్ వాక్ చేసిన ఆ ఈవెంట్‌లో ఐష్ కనపడకపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఏదైతేనేం… ఈసారి మాత్రం ఐశ్వర్య క్యాట్ వాక్ రెడీ అయినట్టే. న్యూఢిల్లీలో ఇండియా కొచ్చర్ వీక్ ఫ్యాషన్ ఈవెంట్‌లో ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి ర్యాంప్‌పై నడవనుంది. 

ఐశ్వర్య చివరి సారి చేసిన షో నుంచి ఇటీవల మిస్సయిన మిజ్వాన్ కూడా మనీష్‌దే కావడం విశేషం. మోడలింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిన ఐశ్వర్య… సినీ నటిగా మారి, కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైన సంగతి తెల్సిందే. 

అయితే తిరిగి  సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఐశ్వర్య నటించిన సినిమా జాజ్‌బా. ఇమ్రాన్‌ఖాన్, షబానా అజ్మీలతో కలిసి ఆమె నటించిన ఈ చిత్రం అక్టోబరు 9 న విడుదలవుతోంది. ఇప్పుడు మళ్లీ ర్యాంప్ వాక్‌కు కూడా ఈ మాజీ మిస్ వరల్డ్ సై అనడంతో… ఇక పూర్తి స్థాయిలో ఈ అందాల ఐశ్వర్యం గ్లామర్ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టే అనుకోవచ్చు.