నిర్మాత దిల్ రాజు కు సినిమా అంటే క్రేజ్. కాస్త ఫీల్ గుడ్ సినిమాలు అంటే మరీ ఇష్టం. అందుకే అలాంటి సినిమాలు వస్తున్నాయంటే ముందే చూస్తారు.
ఈవారం రాబోతోన్న సినిమా రంగ్ దే. హీరో నితిన్-కీర్తి నటించిన ఈ సినిమాను దిల్ రాజు తన భార్య, కుమార్తె తదితరులతో నిన్న రాత్రి చూసారు. సినిమా దిల్ రాజు ఫ్యామిలీకి బాగా నచ్చిందని బోగట్టా.
మంచి సినిమా తీసారని నిర్మాత దిల్ రాజు యూనిట్ ను అభినందించినట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు తో పాటు ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఒకరిద్దరు కూడా సినిమా చూసినట్లు బోగట్టా.
సినిమా ఫీల్ గుడ్ గా వుందని, ఎమోషనల్ కంటెంట్ బాగుందని చూసిన వారంతా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే సురేష్ బాబు సన్నిహితులు కొందరు ప్రత్యేకంగా అరణ్య సినిమా చూసినట్లు బోగట్టా.