Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రష్మిక జపం చేస్తోన్న టాలీవుడ్‌

రష్మిక జపం చేస్తోన్న టాలీవుడ్‌

తెలుగు చిత్ర సీమలో ఇప్పుడు 'మోస్ట్‌ వాంటెడ్‌' హీరోయిన్‌గా మారింది రష్మిక మందాన. దేవవాస్‌, డియర్‌ కామ్రేడ్‌ చిత్రాలు ఫ్లాప్‌ అయినా కానీ వాటి ప్రభావం ఆమె కెరీర్‌పై పడలేదు. మహేష్‌తో 'సరిలేరు నీకెవ్వరు'లో నటించడంతో ఆమె అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. త్వరలో సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ నటించే చిత్రంలోను రష్మిక నటిస్తుంది.

తనని తెలుగు చిత్ర సీమకి పరిచయం చేసిన 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌తో కలిసి 'భీష్మ' చేస్తోన్న రష్మిక తాజాగా నాగచైతన్యతో 'అదే నువ్వు అదే నేను' అనే చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మాణంలో చేయడానికి అంగీకరించింది. మహేష్‌ మేనల్లుడు అశోక్‌ గల్లాతో చేద్దామని తలపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు చైతన్య, రష్మిక చేతికి వచ్చింది.

ఒక్కరోజు కూడా గ్యాప్‌ తీసుకోకుండా సినిమాలు చేస్తోన్న రష్మిక ఇక పూర్తిగా తెలుగు చిత్ర సీమపై దృష్టి పెట్టాలనుకుంటోంది. సమంత తర్వాత అగ్ర హీరోయిన్లు ఎవరూ లేకపోవడంతో ఆ స్థానం కోసం రష్మిక, పూజ హెగ్డే మధ్య పోటీ నెలకొంది. పూజకి హిందీ చిత్రాలు వుండడంతో రష్మిక మరింత స్పీడ్‌ పెంచి తన దగ్గరకి వచ్చిన అవకాశాలని వదలకుండా చేజిక్కించుకుంటోంది. 

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?