Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇలా ప్రకటించారు.. అలా పోస్ట్ పోన్ చేశారు

ఇలా ప్రకటించారు.. అలా పోస్ట్ పోన్ చేశారు

రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. త్వరలోనే వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. ఈ సినిమాకు సంబంధించి 13వ తేదీన టైటిల్ లోగోను విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాతే మూవీని సెట్స్ పైకి తీసుకురావాలనేది ప్లాన్. కానీ ఇప్పుడా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.

"ప్రస్తుతం మా మాస్ మహారాజ్ రవితేజ అమర్-అక్బర్-ఆంటోనీ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. కాబట్టి వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ చేయాల్సిన కొత్త సినిమా టైటిల్ లోగో కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నాం. అమర్ అక్బర్ ఆంటోనీ విడుదల తర్వాత టైటిల్ లోగో విడుదల ఉంటుంది."

గతంలో రవితేజతో నేలటిక్కెట్ అనే ఫ్లాప్ సినిమా తీసిన రామ్ తళ్లూరి, ఈ కొత్త సినిమాను కూడా నిర్మించబోతున్నాడు. అతడే స్వయంగా ఈ ప్రకటన చేశాడు. నిజానికి ప్రస్తుతం రవితేజ చేస్తున్న ప్రచారానికి, ఈ కొత్త సినిమా టైటిల్ లోగో విడుదలకు సంబంధం లేదు.

రవితేజ లేకుండానే ఈ కార్యక్రమం ప్లాన్ చేశారు. కానీ అమర్ అక్బర్ ఆంటోనీ విడుదలకు సరిగ్గా 3 రోజుల ముందు మరో సినిమా టైటిల్ రిలీజ్ చేసి, ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టంలేక కార్యక్రమాన్ని వాయిదావేశారు.

సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లుంటారు. వీళ్లల్లో ఇద్దర్ని ఆల్రెడీ ఫిక్స్ చేశారు. నన్ను దోచుకుందువటే ఫేం నభా నటేష్, ఆర్ఎక్స్-100 ఫేం పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్లుగా సెలక్ట్ చేశారు. మూడో హీరోయిన్ ను త్వరలోనే ప్రకటిస్తారు. నేలటిక్కెట్టులో రవితేజ సరసన నటించిన మాళవికను రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. 

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?