Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రెడ్డి పోయి రాజ్ వచ్చే..

రెడ్డి పోయి రాజ్ వచ్చే..

సినిమా హిట్ అయితేనే.. చాన్స్ లు అనేవి రావడం, పోవడం అనేది. జంబలకిడిపంబ సినిమా విడుదలకు ముందు నిర్మాత టాగోర్ మధు ఓ ప్రాజెక్టును ప్లాన్ చేసారు. కొత్త డైరక్టర్ తో, కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా ఓ చిన్న సినిమా. 

కట్ చేస్తే జంబలకిడిపంబ విడుదలయింది. సినిమా ఆడలేదు. హీరోగా చాలామంది కమెడియన్ల మాదిరిగానే శ్రీనివాసరెడ్డి కెరీర్ కూడా ప్రశ్నార్థకమైంది. దీంతో టాగోర్ మధు ప్లాన్ చేసిన ప్రాజెక్టు కూడా మారిపోయినట్లు తెలుస్తోంది. హీరోగా రాజ్ తరుణ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. 

అయితే ఒకటే అనుమానం. మరో వారంరోజుల్లో రాజ్ తరుణ్ సినిమా విడుదల వుంది. అది హిట్ అయితే ఓకె. తేడావస్తే, మళ్లీ టాగోర్ మధు ప్రాజెక్టులో హీరో మారిపోతాడా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?