Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో కోసం నేషనల్ మీడియా

సాహో కోసం నేషనల్ మీడియా

బాహుబలి ప్రభాస్ అత్యంత భారీ సినిమా సాహో విడుదల దగ్గరకు వస్తోంది. విడుదల సందర్భంగా భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఆదివారం నిర్వహిస్తున్నారు.

రామోజీ ఫిలిం సిటీలో ఇందుకోసం భారీ ఏర్పాట్లుచేస్తున్నాను. సాహో కోసం తయారుచేసిన వాహనాలు, ఇతర సామగ్రి అంతా ఇక్కడ ప్రదర్శనగా వుంచుతున్నారు. భారీ స్టేజ్ తో పాటు, అభిమానుల మధ్య మరో స్టేజ్ కడుతున్నారు.

ఈ స్టేజ్ మీదకు ప్రభాస్ ప్రత్యేకంగా వచ్చి, అభిమానులకు అభివాదం చేసి ఆ తరువాత ప్రధాన వేదిక మీదకు వెళ్తారు.

రాజమౌళి-అరవింద్

ఇప్పటి వరకు సాహో పంక్షన్ లకు ప్రభాస్ మాత్రమే ప్రత్యేక ఆకర్షణ గా  వుంటూ వస్తున్నారు. కానీ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు దిగ్దర్శకుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన అల్లు అరవింద్ ముఖ్య అతిధులుగా వస్తారని తెలుస్తోంది. ప్రభాస్ అంటే రాజమౌళి కి ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతోనే ఇటీవల సాహో సినిమాను ఆయనకు చూపించినట్లు, కొన్ని మార్పులు చెప్పినట్లు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

ఇదిలా వుంటే తమిళ, మలయాళ, హిందీ భాషల మీడియాను కూడా ఈ ఫంక్షన్ కు ప్రత్యేకంగా రప్పిస్తున్నారు. నేషనల్ మీడియా జర్నలిస్ట్ లు ప్రత్యేకంగా సాహో ఈవెంట్ కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. 

ఆర్ఎఫ్సీ ఏర్పాట్లు

పంక్షన్ ఏర్పాట్లు మొత్తం రామోజీ ఫిలిం సిటీలో, ఆ సిటీ సాంకేతిక బృందం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. సాహో సిటీ అంటూ ఏర్పాటు చేస్తున్నది కొన్నాళ్ల పాటు అక్కడే వుంటుంది. సందర్శకులకు అదో ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. అతి పెద్ద ఎల్ ఇ డి స్క్రీన్ ఫంక్షన్ కోసం ఏర్పాటుచేస్తున్నారు. 

మొత్తం మీద సాహో సినిమాకు కీలక ప్రచారానికి రేపే తెరలేస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?