Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాయి ధరమ్ కు సమస్యేమో?

సాయి ధరమ్ కు సమస్యేమో?

ఒక్కోసారి అంతే. అనుకోకుండా ఏదో జరిగి, మరేదో అవుతుంది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారం అలాగే అయ్యేలా వుందని టాక్. ఇంతకీ విషయం ఏమిటంటే, ఠాగోర్ మధు అండ్ కో నిర్మాతలుగా సాయి ధరమ్ తేజ-గోపీచంద్ మలినేని డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేసారు. అది ఆగస్టు-సెప్టెంబర్ నుంచి సెట్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక అదే టీమ్, మరి కొందరు కలిసి మురగదాస్-మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నారు.

ఇదిలా వుంటే మహేష్ సినిమాకు పరిణీతి చోప్రా హీరోయిన్ అనుకున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. కానీ ఇప్పుడు రకుల్ పేరు పరిశీలనలోకి వచ్చింది. అప్పీరియెన్స్ టెస్ట్ కూడా అయింది. మరి రకుల్ నే ఫిక్స్ చేస్తే..? డేట్లు ఎలా? ఎందుకంటే రకుల్ ఇప్పుడు ఫుల్ బిజీగా వుంది. అటు రామ్ చరణ్ సినిమా ఒకటి సెట్ మీద వుంది. 

అలాంటపుడు సాయి ధరమ్ తేజ సినిమా కోసం ఆల్రెడీ ఇచ్చిన డేట్లు మహేష్ కోసం సర్దుబాటు చేసుకోండి అని అంటే...?  మహేష్ కోసం సాయి ధరమ్ హీరోయిన్ ను మార్చాల్సి వస్తుందా? లేదా ఇద్దరు హీరోలకు డేట్లు సర్దుబాటు చేస్తుందా? వెయిట్ అండ్ సీ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?