సాక్ష్యం వన్ వీక్ వెనక్కు?

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అభిషేక్ నామా నిర్మించిన సినిమా సాక్ష్యం. దాదాపు 38 కోట్ల ఖర్చుతో నిర్మించిన భారీ సినిమా ఇది. శ్రీవాస్ దర్శకుడు. పంచభూతాల కాన్సెప్ట్ తో భారీ ఫైట్లు, సిజి వర్క్…

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అభిషేక్ నామా నిర్మించిన సినిమా సాక్ష్యం. దాదాపు 38 కోట్ల ఖర్చుతో నిర్మించిన భారీ సినిమా ఇది. శ్రీవాస్ దర్శకుడు. పంచభూతాల కాన్సెప్ట్ తో భారీ ఫైట్లు, సిజి వర్క్ తో సినిమాను రూపొందించారు. జయజానకీ నాయక సినిమా విడుదల సమయంలో ఎదురైన చేదు అనుభవంతో, ఈ సారి ఎలాంటి ఇగోలకు పోకుండా, సోలో డేట్ ఎప్పుడు దొరికితే అప్పుడు రావాలని ముందుగానే హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అతని తండ్రి బెల్లంకొండ సురేష్, నిర్మాత అభిషేక్ ఫిక్స్ అయ్యారు.

అందుకే జూన్ నుంచి మంచి డేట్ ల కోసం వెదుక్కుంటూ వచ్చి, ఏ సినిమాలు లేని జూలై 20 ని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి కూడా వెనక్కు జరగాల్సి వస్తోందని రూమర్లు వినిపిస్తున్నాయి. మెగా అల్లుడు, మేనల్లుళ్ల సినిమాల కారణంగా మొత్తం విడుదల డేట్ లు అన్నీ మారిపోతున్నాయి. మెగా అల్లుడి సినిమాను ఓ వారం వెనక్కు జరిపారు. దాంతో దిల్ రాజు నిర్మించిన లవర్ ను ఓవారం వెనక్కు జరిపి జూలై 20 కి ఫిక్స్ చేసారు.

దీంతో సాక్ష్యం కూడా వాయిదా పడి జూలై 27కు వెళ్తుందని వినిపిస్తోంది. అయితే నిర్మాణ వర్గాలు దీనిని ధృవీకరించడం లేదు. కానీ దిల్ రాజు కోరిక మేరకు సాక్ష్యం సినిమా వన్ వీక్ వెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది.