అక్కినేని కాంపౌండ్ లో మరో కొత్త బ్యానర్

అన్నపూర్ణ స్టుడియోస్… అక్కినేని కాంపౌండ్ లోనే కాదు, టాలీవుడ్ లోనే పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. తాజాగా “మనం ఎంటర్ ప్రైజస్” పేరుతో మరో బ్యానర్ కూడా స్థాపించారు. మనం అనే టైటిల్ ను…

అన్నపూర్ణ స్టుడియోస్… అక్కినేని కాంపౌండ్ లోనే కాదు, టాలీవుడ్ లోనే పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. తాజాగా “మనం ఎంటర్ ప్రైజస్” పేరుతో మరో బ్యానర్ కూడా స్థాపించారు. మనం అనే టైటిల్ ను వదులుకోవడం ఇష్టంలేక.. ఇకపై అఖిల్, నాగచైతన్య సినిమాల్ని ఇదే బ్యానర్ పై నిర్మిస్తామని కూడా నాగ్ ప్రకటించాడు.

ఇప్పుడీ రెండు బ్యానర్లు కాకుండా కొత్తగా మరో నిర్మాణ సంస్థ రాబోతోంది. అక్కినేని కొత్త కోడలు సమంత ఈ బ్యానర్ ను స్థాపించనుందట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత, నాగచైతన్య కలిసి ఓ కొత్త బ్యానర్ ను నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు.

కన్నడలో హిట్ అయిన యు-టర్న్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతోంది సమంత. ఈ సినిమాలో నటించడమే కాకుండా తనే నిర్మించే ఆలోచనలో కూడా ఉంది. ఇందులో భాగంగానే భర్త నాగచైతన్యతో కలిసి కొత్త బ్యానర్ స్థాపించే ప్లాన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం సమంత నిజంగానే ఓ కొత్త బ్యానర్ స్థాపిస్తుందా… లేక మనం ఎంటర్ ప్రైజస్ పైనే సినిమా నిర్మిస్తుందా అనే విషయం జనవరిలో తేలనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న రంగస్థలం సినిమా కంప్లీట్ అయిన వెంటనే యు-టర్న్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురానుంది సమంత.