Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'సరిలేరు' ట్రయిన్ జర్నీ పూర్తి

'సరిలేరు' ట్రయిన్ జర్నీ పూర్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు - బ్లాక్ బస్టర్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తయారవుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఓ కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది సినిమాలో దాదాపు ముఫై అయిదు నిమిషాలకు పైగా వచ్చే కీలక ట్రయిన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. ఈరోజు చేసే ప్యాచ్ వర్క్ తో అది పూర్తవుతుంది.

దీంతో సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు మినహా మిగిలిన ఫస్ట్ హాఫ్ అంతా పూర్తయిపోయింది. రేపు, ఎల్లుండి మహేష్ ఆర్మీలో వుండగా జరిగే ఇన్ సైడ్ సీన్లు కొన్ని తీసి, ఆపై కొండారెడ్డి బురుజు సెట్ మీదకు వెళ్తున్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ ను రామోజీ ఫిలింసిటీలో నిర్మించిన సంగతి గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక్కడ నుంచి ఇక షూట్ అంతా అక్కడ జరుగుతుంది. ఆ తరువాత కేరళలో క్లయిమాక్స్ షూట్ చేస్తారు. దాంతో పాటలు మినహా సినిమా అంతా పూర్తయినట్లే. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమాను చాలా ముందుగానే ఫినిష్ చేసే ఆలోచనలో వున్నారు ఇటు మహేష్ బాబు-అటు అనిల్ రావిపూడి కూడా. అందుకే నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నారు.

ఇదిలావుంటే మహేష్ బాబు ఆర్మీ డ్రెస్ మీద వస్తున్న కామెంట్ లపై యూనిట్ వైపు నుంచి కూడా సమాధానం వినిపిస్తోంది. మహేష్ బాబు ఈ సినిమాలో స్పెషల్ ఫోర్స్ సభ్యుడిగా వుంటాడని, వాళ్లకు డ్రెస్ కోడ్ లాంటివి వుండవని చెబుతున్నారు. పైగా కమర్షియల్ సినిమాను సినిమాలా చూడాలని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?