Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సర్కారువారి పాట సాగుతోంది

సర్కారువారి పాట సాగుతోంది

ఆచార్య సినిమా కొత్త డేట్ ఏప్రిల్ 1 విడుదల అంటూ వార్తలు వచ్చేసాయి. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సంగతేంటీ? 2021లో రావాల్సింది 2022 సంక్రాంతి అన్నారు. ఏపోటీ లేనపుడే కాదు సమ్మర్ కు వెళ్తున్నామన్నారు. ఇప్పుడు ఆ డేట్ కూడా వదిలేస్తున్నారు. 

సర్కారు వారి పాట సినిమా డైరక్టర్ పరశురామ్ పని తీరు మీద హీరో మహేష్ బాబు చాలా అసంతృప్తిగా వున్నారని తెగ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఆ మధ్య దుబాయ్ వెళ్లడానికి ముందు పిలిచి క్లాస్ పీకారని కూడా వార్తలు వినిపించాయి. అప్పటి వరకు తీసిన ఫుటేజ్ లో తను లేని సీన్ ఒక్కటి కూడా కనిపించకపోయేసరికి, అసలు ఏం జరుగుతోంది. మిగిలిన సీన్ల సంగతేమిటి అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. 

దాంతో మహేష్ లేని సీన్లు అన్నీ తీసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యనే వైజాగ్ లో ఫైట్ సీన్లు కూడా తీసారు. సాధారణంగా సినిమాల్లో హీరో లేని ఫైట్ సీన్ల అరుదుగా వుంటాయి. మరి ఈ ఫైట్లు ఏమిటో తెలియాల్సివుంది. సర్కారు వారి పాట సంగతి ఎలా వున్నా, మార్చి తరువాత డేట్ లు ఇస్తానని త్రివిక్రమ్ కు మహేష్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరి ఇలా అయితే సర్కారువారిపాట ఎప్పటికి రెడీ అవుతుందో? ఎప్పుడు విడుదల అవుతుందో? దర్శకుడు పరుశురామ్ మంచి చాన్స్ మిస్ చేసుకుంటున్నట్లుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?