శర్వా సినిమా సెట్ లో భూకంపం

శర్వానంద్ సినిమాకు భూకంపం ఎఫెక్ట్ తగులుతోంది. కథలో వున్నాక తప్పదు కదా? అందుకే అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ భూకంపం సెట్ వేస్తున్నారు. పైగా భూకంపం అంటే సెట్ వేస్తే సరిపోదు కదా? దానికి సిజి…

శర్వానంద్ సినిమాకు భూకంపం ఎఫెక్ట్ తగులుతోంది. కథలో వున్నాక తప్పదు కదా? అందుకే అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ భూకంపం సెట్ వేస్తున్నారు. పైగా భూకంపం అంటే సెట్ వేస్తే సరిపోదు కదా? దానికి సిజి వర్క్ కూడా కావాలి. అందుకని ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఇదంతా డైరక్టర్ హను రాఘవపూడి సినిమా సంగతే. శర్వానంద్-సాయి పల్లవిలతో 'పడిపడి లేచె మనసు' అంటూ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాది అంతా కాస్త భారీ వ్యవహారమే. కలకత్తా షెడ్యూల్ నే 70 రోజులు చేసారు. ఇంకా మరో నలభై యాభై రోజులు వర్క్ వుంటుందని తెలుస్తోంది.

అందువల్ల ఈ భూకంపం వ్యవహారం ఒకటి. క్లయిమాక్స్ లో భూకంపం అనేది హైలట్ గా తెలుస్తోంది. అందుకనే భారీ సెట్, సిజి వర్క్ కు డిసైడ్ అయిపోయారు. ఇదిలా వుంటే ఇటీవల విడిుదలైన తేజ్ ఐ లవ్ యూ సినిమాకు ఈ సినిమాకు ఓ కామన్ పాయింట్ వుందని గతంలోనే గుసగుసలు వినిపించాయి. హీరోయిన్ తన ప్రేమను మరిచిపోవడం, హీరో గుర్తు చేయడం అన్నది ఆ కామన్ పాయింట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. 

మరి ఈ భూకంపం క్లయిమాక్స్ ఏమిటన్నది మాత్రం తెలియాల్సి వుంది.