సవ్యసాచికి రెండు వెర్షన్లు?

నాగ్ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో మైత్రీ సంస్థ నిర్మిస్తున్న సినిమా సవ్యసాచి. భూమిక ఈ సినిమాలో చైతూ అక్కగా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ కీలకమైన పాయింట్ ను రెండు…

నాగ్ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో మైత్రీ సంస్థ నిర్మిస్తున్న సినిమా సవ్యసాచి. భూమిక ఈ సినిమాలో చైతూ అక్కగా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ కీలకమైన పాయింట్ ను రెండు వెర్షన్లుగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఓ బ్లాస్ట్ సన్నివేశంలో భూమిక తీవ్రంగా గాయపడే సన్నివేశం వుందట. 

అయితే అలా గాయపడిన భూమిక మరణిస్తుందా? లేక కోమాలోకి వెళ్తుందా? అన్న విషయమై రెండు వెర్షన్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు వెర్షన్లకు డబ్బింగ్ లు కూడా మిగిలిన నటుల చేత చెప్పించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాధవన్ ది కీలక విలన్ పాత్ర. భూమికను ప్రేమించే పాత్ర కూడా అదే అని తెలుస్తోంది.

ఇదిలా వుంటే సవ్యసాచి ద్వితీయార్థం మొత్తం యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండడంతో కాస్త కామెడీ సీన్లు జోడిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిసున్నాయి. చైతూకి చందు మొండేటితో ఇది రెండో సినిమా. ఈ ఇద్దరికి మైత్రీ మూవీస్ లో ఇది మొదటి సినిమా. ఇప్పటి వరకు భారీ సినిమాలు, పెద్ద హీరోలతో సినిమాలు చేసిన మైత్రీ మూవీస్ తొలిసారి మీడియం సినిమా చేస్తోంది.

అయితే దీనికి కూడా పాతిక కోట్లకు పైగానే బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది.