తేజు చేతికి నాని సినిమా

నాని హీరోగా కిషోర్ తిరుమల డైరక్షన్ లో సినిమా చేయాలనుకున్నారు మైత్రీమూవీస్ నిర్మాతలు. అయితే అప్పట్లో నాని డిసైడ్ చేసుకోలేదు ఏ సినిమా ముందు ఏ సినిమా వెనుక అన్నది. అంతేకాకుండా చిత్రలహరి సెకండాఫ్…

నాని హీరోగా కిషోర్ తిరుమల డైరక్షన్ లో సినిమా చేయాలనుకున్నారు మైత్రీమూవీస్ నిర్మాతలు. అయితే అప్పట్లో నాని డిసైడ్ చేసుకోలేదు ఏ సినిమా ముందు ఏ సినిమా వెనుక అన్నది. అంతేకాకుండా చిత్రలహరి సెకండాఫ్ స్క్రిప్ట్ అంతగా నచ్చలేదు నానికి. దాంతో నో చెప్పేసాడు. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.

ఆ తరువాత ఆ ప్రాజెక్టు ఎవరికి వెళ్తుందా అన్న విషయమై చాలాపేర్లు వినిపించాయి. వాటిలో సాయిధరమ్ తేజ పేరు ఒకటి. అయితే ఇప్పుడు ఆఖరికి ఆ పేరే ఫైనల్ అయింది. సాయిధరమ్ తేజ హీరోగా వచ్చేనెల నుంచి చిత్రలహరి సినిమా సెట్ మీదకు వెళ్తుంది. 

ప్రస్తుతం సాయిధరమ్ తేజ చేసిన తేజ్ ఐలవ్ యూ సినిమా పూర్తయింది. తరువాతి ప్రాజెక్టుగా గీతా-మారుతి కాంబినేషన్ లో సినిమా వుండాలి. కానీ మారుతి ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా వున్నారు. అందువల్ల గీతా వేరే ప్రాజెక్టు స్టార్ట్ చేస్తుందా? లేక చిత్రలహరి ముందుగా చేసి, ఆ తరువాత గీతా సినిమా స్టార్ట్ చేస్తారా? అన్నది చూడాలి.