సవ్యసాచిపై క్లారిటీ కోరిన చైతన్య?

సవ్యసాచి. మైత్రీ మూవీస్ సంస్థ చందు మొండేటి డైరక్షన్ లో నాగ్ చైతన్యతో నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమా ఆది నుంచీ అనుకున్న షెడ్యూలు ప్రకారం వెళ్లడం లేదు. దానికి తోడు గ్రాఫిక్ సమస్య.…

సవ్యసాచి. మైత్రీ మూవీస్ సంస్థ చందు మొండేటి డైరక్షన్ లో నాగ్ చైతన్యతో నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమా ఆది నుంచీ అనుకున్న షెడ్యూలు ప్రకారం వెళ్లడం లేదు. దానికి తోడు గ్రాఫిక్ సమస్య. దీంతో నాగ్ చైతన్య ప్లానింగ్ కాస్త దెబ్బతింది. ఇటు సవ్యసాచి, అటు శైలజరెడ్డి అల్లుడు ఒకేసారి రెడీ అయిపోయి, రెండూ ఒకేసారి విడుదలయ్యే పరిస్థితి వచ్చింది.

ఇలాంటి టైమ్ లో సవ్యసాచి కోసం ఇంకా మరో పది రోజులు డేట్ షూట్ బకాయి వుంది. కానీ నాగ్ చైత్యన్య జూలై 24 వరకు శైలజరెడ్డి అల్లుడు షూట్ లో వుంటాడు. కనీసం రెండు రోజులు రెస్ట్ తీసుకుని 26 నుంచి మొదలు పెట్టినా, ఆగస్టు 10న విడుదల చేయడం కష్టమే. అలాంటిది ఏదో ఒకటి చేసి ఆగస్టు 3న విడుదల చేస్తాం అంటున్నారట నిర్మాతలయిన మైత్రీమూవీస్ వారు.

దీంతో అసలు ఇంతవరకు ఏం తీసారు. ఇంకా ఏం తీయాల్సి వుంది. ఎలా వచ్చిందీ అన్నీ తనకు క్లారిటీగా చెప్పమని నాగ్ చైతన్య నిర్మాత, దర్శకులను కోరినట్లు తెలుస్తోంది. అవసరం అయితే శైలజ రెడ్డి అల్లుడు ముందు విడుదల చేసి, పక్కాగా ఫినిష్ చేసిన తరువాతే సవ్యసాచి విడుదల చేయించే అయిడియాలో వున్నాడట నాగ్ చైతన్య.

దీనికి వేరే కారణం కూడా తోడయింది. చైతన్య చేస్తున్న సవ్యసాచి ఫుల్ యాక్షన్ జోనర్. శైలజరెడ్డి అల్లుడు ఫ్యామిలీ జోనర్. వీటి తరువాత చేయబోయే శివనిర్వాణ డైరక్షన్ లోని సినిమా కూడా ఫ్యామిలీ లవ్ స్టోరీనే. అందువల్ల సినిమాల జోనర్లు డిఫరెంట్ గా వుండేలా, ముందు శైలజరెడ్డి అల్లుడు, ఆ తరువాత సవ్యసాచి, ఆపై శివనిర్వాణ సినిమా వుండేలా ప్లాన్ చేయాలని చైతన్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.