Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎట్టకేలకు సౌత్ కు వచ్చిన హీరోయిన్

ఎట్టకేలకు సౌత్ కు వచ్చిన హీరోయిన్

తెలుగులో ఆమె చేసిన ఆఖరి సినిమా కాటమరాయుడు. తమిళ్ లో ఆమె చేసిన చివరి సినిమా సింగం-3. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ సౌత్ వైపు చూడలేదు శృతిహాసన్. అలా దాదాపు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు మరో సౌత్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చింది.

విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా చేయబోతోంది శృతిహాసన్. నిన్న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి శృతిహాసన్ కూడా హాజరైంది. వీళ్లిద్దరి కాంబోలో ఇది ఫస్ట్ మూవీ. ఈ సినిమాకు లాబం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

మొన్నటివరకు ఓ మ్యూజిక్ ఆల్బమ్, లైవ్ కన్సర్ట్ తో బిజీగా గడిపింది శృతి. అంతకంటే ముందు బాయ్ ఫ్రెండ్ తో కొన్నాళ్లు లండన్ లో ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ, బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమాతో కోలీవుడ్ కు కూడా వచ్చింది.

ఇక మిగిలింది టాలీవుడ్ మాత్రమే. కాటమరాయుడు ఫ్లాప్ తర్వాత తెలుగులో మరే సినిమాకు కమిట్ అవ్వలేదు శృతి. ఆఫర్లు బాగానే వచ్చినప్పటికీ అన్నింటినీ పక్కనపెట్టింది. తమిళ సినిమా ఒప్పుకుంది కాబట్టి, అదేఊపులో ఓ తెలుగు సినిమాకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. బహుశా అది చిరంజీవి-కొరటాల సినిమానే కావొచ్చు.

'ఎవరు గెలుస్తారు?' అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది

కాంచన నుంచి పాఠాలు లారెన్స్ నేర్చుకున్నాడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?