Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పీపుల్స్ ప్లాజాలో మహర్షి ఫంక్షన్

పీపుల్స్ ప్లాజాలో మహర్షి ఫంక్షన్

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో నిర్మించిన సినిమా మహర్షి. ఈ సినిమా ప్రమోషన్లకు సమయం వచ్చింది. ప్రీరిలీజ్ ఫంక్షన్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఈ ఫంక్షన్ ఏర్పాటుకు అనుమతి సంపాదించారు. గతంలో ఎల్బీ స్టేడియంలో భరత్ అనే నేను ఫంక్షన్ చేసారు. అయితే ఆ సమయంలో గ్రౌండ్ కొంచెం పాడయిందని కొంత టాక్ వచ్చింది. ఈసారి ట్రయ్ చేసారు కానీ ఈవిఎమ్ మెషీన్లు అవీ ఆ ప్రాంతంలోనే వుండడంతో పర్మిషన్లు రాలేదని తెలుస్తోంది.

అందుకే ఈసారి నెక్లేస్ రోడ్ ను ఎంచుకున్నారు. మేడే నాడు ఎలాగూ సెలవు, సమ్మర్ లో నెక్లేస్ రోడ్ లో జనాలు ఎక్కువగా వుంటారు. దీనికితోడు ఫ్యాన్స్. ఇక ఓ రేంజ్ లో ఫంక్షన్ వుండే అవకాశం వుంది. ఇదిలావుంటే ఫంక్షన్ కు మహేష్ తండ్రి కృష్ణ ఎలాగూ తప్పనిసరిగా వస్తారు. మరి ఇంకెవరు వస్తారా? అన్నది ప్రశ్న.

లాస్ట్ టైమ్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈసారి ఎవరు అన్నది? ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ అందుబాటులో వున్నట్లులేదు. మరి ఎవరు వస్తారో చూడాలి. కొరటాల శివ లాంటి కొద్దిమంది డైరక్టర్లు కూడా ఫంక్షన్ కు హాజరవుతారని తెలుస్తోంది.

'ఎవరు గెలుస్తారు?' అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది

కాంచన నుంచి పాఠాలు లారెన్స్ నేర్చుకున్నాడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?