సిసింద్రీని కెమెరా ముందుకొచ్చేశాడా?

అక్కినేని త్రయంతో `మ‌నం` తెర‌కెక్కింది. అందులో అఖిల్ న‌టించాలా? వ‌ద్దా అనే విష‌యం గురించి తొలి నుంచి తీవ్ర త‌ర్జన‌భ‌ర్జన‌లు సాగాయి. అయితే నాగార్జున మాత్రం అఖిల్‌ని సోలోగా తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డ‌మే మేల‌ని…

అక్కినేని త్రయంతో `మ‌నం` తెర‌కెక్కింది. అందులో అఖిల్ న‌టించాలా? వ‌ద్దా అనే విష‌యం గురించి తొలి నుంచి తీవ్ర త‌ర్జన‌భ‌ర్జన‌లు సాగాయి. అయితే నాగార్జున మాత్రం అఖిల్‌ని సోలోగా తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డ‌మే మేల‌ని భావించాడు. ఆ మేర‌కు అఖిల్ `మ‌నం`లో న‌టించ‌డం లేద‌ని కూడా ఆయ‌న స్పష్టం చేశాడు. అయితే… అక్కినేని నాగేశ్వర‌రావు మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న మ‌న‌సు మార్చుకొన్నట్టు స‌మాచారం. 

`మ‌నం`లో న‌లుగురూ క‌నిపిస్తేనే బాగుంటుంద‌నీ, తాతగారి చివ‌రి సినిమాలో అఖిల్ కూడా ఉంటే బాగుంటుంది క‌దా అని ఆయ‌న భావించార‌ట‌. ఆ మేర‌కు ఒక‌ట్రెండు స‌న్నివేశాలు, ఓ పాట‌ని ప్రత్యేకంగా తీర్చిదిద్దార‌ట‌. వాటికోసం అఖిల్‌ని కెమెరా ముందుకు తీసుకొచ్చార‌ట‌. ఆ స‌న్నివేశాలు అభిమానుల‌ను అల‌రిస్తాయ‌ని అన్నపూర్ణ కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 

మొత్తమ్మీద తాత‌గారి సినిమాలో న‌టించాల‌న్న అఖిల్ కోరిక‌తో పాటు, అక్కినేని అభిమానుల ముచ్చట‌నీ నాగార్జున ఈ ర‌కంగా తీర్చేశాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖ‌రులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నట్టు స‌మాచారం. ఇందులో నాగ‌చైత‌న్య స‌ర‌సన స‌మంత‌, నాగార్జున స‌ర‌స‌న శ్రియ న‌టించింది.