మ‌హేష్‌ని మ‌ణి వ‌ద‌ల‌డం లేద‌ట‌!

మ‌ణిర‌త్నం ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నారు. త‌మిళంలో ప్రాచుర్యం పొందిన ఓ పుస్తకం ఆధారంగా ఆ చిత్రం తెర‌కెక్కబోతోంది. అందులో మ‌హేష్‌, నాగార్జున‌ని క‌థానాయ‌కులుగా ఎంచుకొన్నాడు. ఇప్పటికే నాగార్జున ఈ సినిమా…

మ‌ణిర‌త్నం ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నారు. త‌మిళంలో ప్రాచుర్యం పొందిన ఓ పుస్తకం ఆధారంగా ఆ చిత్రం తెర‌కెక్కబోతోంది. అందులో మ‌హేష్‌, నాగార్జున‌ని క‌థానాయ‌కులుగా ఎంచుకొన్నాడు. ఇప్పటికే నాగార్జున ఈ సినిమా చేసేందుకు ఒప్పుకొన్నారని తెలిసింది. అయితే మ‌హేష్ మాత్రం కాల్‌షీట్లు లేవ‌ని చెప్పాడ‌ట‌. `మీ సినిమా ఇప్పట్లో చేయ‌లేన‌`ని  మ‌ణికి క‌బురు పంపార‌ట‌. 

అయితే మ‌ణి మాత్రం మ‌హేష్‌ని వ‌ద‌ల‌డం లేద‌ట‌. ఎలాగైనా ఈ సినిమా చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌. నాగార్జున స్థానంలో వేరొక‌రిని ఎవ‌రినైనా చూసుకోవ‌చ్చు కానీ… మ‌హేష్ పాత్ర మాత్రం త‌నే చేయాల‌ని అనుకొంటున్నాడ‌ట‌. ఆయ‌న్ని దృష్టిలో ఉంచుకొని ఆ పాత్రని మ‌లుస్తున్నార‌ట‌. 

అందుకే `ఈ సినిమా చేయాల్సిందే` అని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట మ‌ణి. అంత పెద్ద ద‌ర్శకుడు చెబుతున్న మాటని తిర‌స్కరించకూడ‌ద‌ని నిర్ణయించుకొన్నాడ‌టు. వేరొక సినిమాని ఆల‌స్యం చేసైనా మ‌ణి సినిమాలో న‌టించాల‌ని ఫిక్స్ అయిపోయాడట‌. ఇదొక థ్రిల్లర్ సినిమాగా తెర‌కెక్కుతుంద‌ని స‌మాచారం.