మహేష్ కోసమే ఆ కాంబినేషన్ కలిసిందా?

తన నెక్ట్స్ సినిమా మహేష్ తో ఉంటుందని చాన్నాళ్ల కిందటే ప్రకటించాడు సుకుమార్. ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో మహేష్ తో సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు. కానీ ఈ దర్శకుడు చెప్పిన స్టోరీలైన్ మహేష్…

తన నెక్ట్స్ సినిమా మహేష్ తో ఉంటుందని చాన్నాళ్ల కిందటే ప్రకటించాడు సుకుమార్. ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో మహేష్ తో సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు. కానీ ఈ దర్శకుడు చెప్పిన స్టోరీలైన్ మహేష్ కు నచ్చలేదు. దీంతో మహేష్-సుక్కూ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ కాంబినేషన్ మరో విధంగా సెట్ అయ్యేలా ఉంది.

రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో భారీ డీల్ కుదుర్చుకుంది ఎరోస్ సంస్థ. ఒప్పందం ప్రకారం ఎరోస్ కు దాదాపు 10 కథలు ఇచ్చాడు విజయేంద్రప్రసాద్. వీటికి సంబంధించి కొంతమంది దర్శకుల్ని కూడా అనుకున్నారు. వీటిలో ఒక కథకు దర్శకుడు సుకుమార్ ను అనుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే మహేష్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.

విజయేంద్ర ప్రసాద్ రాసిన కథను డైరక్ట్ చేయడానికి సుకుమార్ ఒప్పుకుంటే చాలు. మహేష్ ను ఒప్పించే బాధ్యతను విజయేంద్రప్రసాద్, ఎరోస్ సంస్థలు చూసుకుంటాయి. ఎందుకంటే, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఎరోస్ వద్ద మహేష్ కాల్షీట్లు ఉన్నాయి. విజయేంద్రప్రసాద్ తన కథతో మెప్పిస్తే కనుక మహేష్-సుక్కూ ప్రాజెక్టు సెట్ అయిపోయినట్టే.

కానీ ఈ ప్రతిపాదనకు సుకుమార్ ఒప్పుకుంటాడా అనేది అందర్లో డౌట్. ఎందుకంటే మొదటి సినిమా ఆర్య నుంచి నిన్నటి రంగస్థలం వరకు ప్రతి సినిమాకు తనే కథ రాసుకున్నాడు. అతడి దగ్గర బలమైన రైటర్స్ టీమ్ ఉంది. మరోవైపు బాహుబలి లాంటి సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ కు, కోట్లలో డీల్స్ సెట్స్ చేసే ఎరోస్ లాంటి పెద్ద సంస్థకు సుకుమార్ నో చెబుతాడని ఊహించలేం. 

మహేష్ తన కథను ఎలాగూ రిజెక్ట్ చేశాడు కాబట్టి, విజయేంద్రప్రసాద్ చెప్పిన కథతోనే సుకుమార్ ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే ఎరోస్ సంస్థ దీనిపై ఓ ప్రకటన చేయనుంది.