Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సురేష్ బాబు ఎందుకు వెళ్లనట్లో?

సురేష్ బాబు ఎందుకు వెళ్లనట్లో?

సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, అలాగే అఫీషియల్ బాడీల రిప్రజెంటేటివ్ లతో మంత్రి పేర్ని నాని, అధికారుల సమావేశం సోమవారం 11 గంటలకు ఏర్పాటు చేసారు. 

చాలా మంది బయల్దేరి వెళ్లారు. బయల్దేరాలని అనుకుని కూడా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకున్నారు టాలీవుడ్ లో అన్ని విధాలా కీలకంగా వున్న సురేష్ బాబు లాస్ట్ మినిట్ లో తన జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఎందుకన్నది తెలియదు.

ఇదిలా వుంటే నిర్మాతలను ఎవరినీ పిలవలేదు. ఆఫీసు బేరర్లు, ఎగ్జిబిటర్ల సెక్టార్ తో సంబంధం వున్న వారినే పిలిచారని తెలుస్తోంది. అయితే మంత్రి పేర్ని నాని తో సన్నిహిత సంబంధాలున్న మైత్రీ మూవీస్ అధినేతలు మాత్రం సమావేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

యువి వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, దామోదర ప్రసాద్, తదితరులు సమావేశానికి హాజరవుతున్నారని బోగట్టా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?