Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చుట్టూ తిరిగి హైదరాబాద్ వచ్చిన సైరా

చుట్టూ తిరిగి హైదరాబాద్ వచ్చిన సైరా

సాధారణంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లన్నీ హైదరాబాద్ లోనే జరుగుతాయి. కానీ సైరా ఫంక్షన్ ను కర్నూల్ లో చేయాలనుకున్నారు. తర్వాత విజయవాడకు మార్చినట్టు వార్తలొచ్చాయి. మధ్యలో విశాఖపట్నం పేరు కూడా వినిపించింది. ఇప్పుడు చుట్టూ తిరిగి వేదికను మళ్లీ హైదరాబాద్ కే మార్చారు. అవును.. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోనే ఉంటుంది.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి, రేనాడు ప్రాంతానికి చెందిన వాడు. అది ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఫంక్షన్ చేస్తే సందర్భోచితంగా ఉంటుందని యూనిట్ భావించింది. కానీ ప్రముఖులంతా వస్తున్న ఫంక్షన్ కావడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతుందని యూనిట్ భావిస్తోంది. అదే హైదరాబాద్ అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. అందుకే హైదరాబాద్ నే ఫిక్స్ చేశారు.

ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది మెగాహీరోలు కూడా హాజరవుతున్నారు. అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం హైదరాబాద్ లోనే ఫంక్షన్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తేదీని మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. మరో 2 రోజుల్లో డేట్ ఖరారవుతుంది.

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటించగా.. తమన్న, అనుష్క కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది సైరా.

జగన్... గారాబం చేయడం నేర్చుకోవాలి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?